కేబుల్‌ ఆపరేటర్‌ ఆత్మహత్య

18 Feb, 2019 13:15 IST|Sakshi

రెడ్డిపాలెం శివారులో పురుగుల మందు తాగిన గిరిజాశంకర్‌

సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్న వైనం

ఆందోళనలో కేబుల్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ నాయకులు

సిటీ కేబుల్‌ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగిన ఆపరేటర్లు

గుంటూరు : ‘నాది కేబుల్‌ వ్యాపారం. కేబుల్‌లోనే ఉన్నా... కేబుల్‌తోనే పోతా... నా చావుతోనైనా ఎంఎస్‌ఓలు మారుతారని కోరుకుంటున్నా. ఓఎల్‌టీలు కొనలేం. సార్‌.. మమ్మల్ని కనిపెట్టుకోండి. ఈ పని ఇంకో ఆపరేటర్‌ చేయకుండా చూసుకోండి సార్‌. చాలా మంది కేబుల్‌ మీదే బతుకుతున్నాం. ఈ నా చావు మీకు కనువిప్పు కావాలి అని కోరుకుంటున్నాను.. నా కేబుల్‌ ఏరియాను ఎవరైనా పెద్ద మనషులు తీసుకోని నా కుటుంబానికి న్యాయం చేయండి. అమ్మా ఈ జన్మకు ఇంతే.. నన్ను అందరూ క్షమించండి’ అంటూ గుంటూరుకు చెందిన కేబుల్‌ ఆపరేటర్‌ గిరిజాశంకర్‌ పురుగు మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. ట్రాయ్‌ నిబంధనల మేరకు సిటీ కేబుల్‌ ధరలు పెంచడంతో మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకున్నారు.

మరిన్ని వార్తలు