రోడ్డు ప్రమాదం.. జూబ్లీహిల్స్‌లో కారు పల్టీ..

17 May, 2018 12:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో బుధవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 1లో జరిగింది. వివరాలివి.. అతి వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో డివైడర్‌ రైలింగ్‌ విరిగిపోయింది. మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయటంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అతి వేగం కారణంగా టీఎస్‌ 08ఈఎస్‌ 7777 నంబర్‌ కారు పల్టీ కొట్టింది.

ఈ సమయంలో కారులో యువతి యువకులు ఉన్నట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. స్థానికలు వెంటనే సమాచారాన్నిపోలీసులకు అందించారు. విషయం  తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయాలైన వారికి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు