డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

30 Apr, 2018 10:47 IST|Sakshi

సాక్షి, గద్వాల : ఉండవెల్లి మండలం పుల్లూరు వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంగా వస్తున్న కారు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.  క్షతగాత్రుల్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.  డ్రైవర్‌ అలక్ష్యమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రాథమిక విచారణ అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు