కృష్ణలంక హైవేపై కారు బీభత్సం

21 Feb, 2019 07:34 IST|Sakshi

సాక్షి, విజయవాడ: విజయవాడ కృష్ణలంక హైవేపై ఓ కారు బీభత్సం సృష్టించింది. గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు సినీఫక్కిలో ఎదురుగా వస్తున్న లారీ మీద ఎగిరి పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. లారీ డ్రైవర్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. అధిక వేగంతో వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మృతి చెందిన వ‍్యక్తిని గుంటూరు జిల్లాకు చెందిన నాగార్జునగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి సమాచారం సేకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు