సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో ఉన్న సాయినగర్లో శుక్రవారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎల్బీనగర్ డీసీపీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో 250 మంది పోలీసులు తనిఖీలు జరిపారు. 14 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని, అలాగే 25 బైక్లు, 70 మద్యం బాటిళ్లు, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.