బాలికపై అత్యాచారయత్నం..పోలీస్‌పై కేసు

13 Feb, 2019 22:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరువనంతపురం: కదులుతున్న రైల్లో పదిహేడేళ్ల బాలికపై అత్యాచార యత్నం చేయబోయిన ఓ పోలీసుపై రైల్వే పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. నిందితుడు కేరళ రాష్ట్రం విజిలెన్స్‌ డిపార్ట్‌మెంటులో పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్న దిన్షాద్‌(38)గా గుర్తించారు. బాలిక ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

రెండు వారాల క్రితం రైలు తిరువనంతపురం సరిహద్దున ఉన్న సష్టంకొట్టా వద్దకు వచ్చినపుడు బాలిక పట్ల నిందితుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు ఆధారంగా తెలిసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ప్రస్తుతం నిందితుడు దిన్షాద్‌ పరారీలో ఉన్నాడు.

మరిన్ని వార్తలు