మళ్లీ తెరపైకి అయేషా మీరా హత్య కేసు

28 Dec, 2018 13:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సంచలనం సృష్టించిన నర్సింగ్‌ విద్యార్థిని అయేషా మీరా(19) హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు మళ్లీ కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. అయేషా మీరా కేసులో అసలు నిందితులను పట్టుకోవటంలో ఏపీ పోలీసులు విఫలమవ్వటంతో హైకోర్టు ఈ కేసును సీబీఐకి బదిలీ చేసింది.

ఈ మేరకు కొత్తగా ఎఫ్ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. మరోసారి సత్యం బాబుతో సహా కేసుతో సంబంధం ఉన్న అందరిని సీబీఐ ప్రశ్నించనుంది. 

మరిన్ని వార్తలు