కోవిడ్‌ యాప్స్‌పై సీబీఐ హెచ్చరిక

19 May, 2020 20:11 IST|Sakshi

కోవిడ్‌-19 సమాచారం పేరిట హానికారక యాప్‌ లూటీ

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ మహమ్మారి సమాచారం కోసం స్మార్ట్‌ఫోన్లలో యాప్‌లను ఇబ్బడిముబ్బడిగా డౌన్‌లోడ్‌ చేసుకుంటే మీ జేబు గుల్లయ్యే ప్రమాదం ఉందని సీబీఐ హెచ్చరించింది. కరోనా వైరస్‌ సంబంధిత అప్‌డేట్స్‌ను ఉపయోగిస్తూ ఓ హానికర యాప్‌ దాన్ని ఇన్‌స్టాల్‌ చేసుకున్న యూజర్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల వంటి ఆర్థిక సమాచారాన్ని దొంగిలించి ఆయా ఖాతాల నుంచి నగదును విత్‌డ్రా చేస్తాయని సీబీఐ పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలను అప్రమత్తం చేసింది. స్మార్ట్‌ఫోన్‌ యూజర్లను నిండాముంచుతున్న ఈ యాప్‌ నిర్వాకంపై సీబీఐకి  ఇంటర్‌పోల్‌ సమాచారం అందించింది. ఈ హానికారక సాఫ్ట్‌వేర్‌ కోవిడ్‌-19 కంటెంట్‌ పేరుతో ఎస్‌ఎంఎస్‌ను పంపి దానిద్వారా ఈ లింక్‌ను డౌన్‌లోడ్‌ చేసకునేలా యూజర్లను బోల్తాకొట్టిస్తుందని సీబీఐ పేర్కొంది. కాగా పలు రాష్ట్రాల పోలీసులకు ఈ తరహా మోసాలపై పెద్దసంఖ్యలో ఫిర్యాదులు వస్తున్న సంగతి తెలిసిందే.

చదవండి : విజయ్‌ మాల్యాకు భారీ షాక్‌

మరిన్ని వార్తలు