ప్రభుత్వ ఫిర్యాదు: వెబ్‌సైట్‌ మోసం గుట్టు రట్టు..

29 May, 2018 16:22 IST|Sakshi

సాక్షి, హైదారాబాద్‌:  నగరంలో భారీ సైబర్‌ మోసం బయటపడింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ వెబ్‌సైట్‌ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైం స్టేషన్‌ పోలీసులు మంగళవారం రట్టు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన సీసీఎస్‌ పోలీసులు నకిలీ వెబ్‌సైట్‌ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నకిలీ వెబ్‌సైట్‌లతో ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా అక్రమాలకు పాల్పడుటున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పట్టుబడిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల నుంచి నగదు, సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు