జెడ్పీలో ఉద్యోగాల పేరిట మోసం

15 Dec, 2017 13:55 IST|Sakshi

11మంది అరెస్ట్‌

ఒంగోలు: ప్రకాశం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఉద్యోగాల పేరిట మోసం చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కొందరు వ్యక్తుల ముఠా నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించి ఉద్యోగ ఉత్తర్వులు అంటూ పలువురు నిరుద్యోగులను మోసం చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు షేక్‌ ఖాసిమ్‌ అనే వ్యక్తి సహా 11మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.31 లక్షల నగదు, డాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు