లక్కీ డ్రా పేరిట మోసం

31 Jan, 2019 07:31 IST|Sakshi
కూరగాయలు తరిగే సెట్‌ను చూపిస్తున్న రామకృష్ణ

విశాఖపట్నం, అనంతగిరి(అరకులోయ): లక్కీడ్రా పేరుతో ఫోన్‌ ఇసా ్తమని తెలపడం తో రూ.3,500 చెల్లించి  మండలంలోని కాశీ పట్నం పంచాయతీ మండపర్తి గ్రామానికి చెందిన పాడి రామకృష్ణ అనే గిరిజన యువకుడు మోసపోయాడు. వివరాలు ఇలా గత బుధవారం అతనికి కాల్‌ వచ్చింది. 

మీ మొబైల్‌ నంబరుకు  బ్లూటూత్, శాంసంగ్‌  ఫోన్‌ లక్కీడ్రాలో వచ్చాయని అవతలవ్యక్తి చెప్పారు. మీవివరాలు తెలి పితే  పోస్టు ద్వారా వాటిని పంపింస్తామని, అయితే  రూ 3,500 చెల్లించాలని తెలిపారు. మళ్లీ వారం రోజుల తరువాత పోస్టల్‌ కార్యాలయానికి వెళ్లి తీసుకోమని ఫోన్‌ వచ్చింది. దీంతో  రామకృష్ణ పోస్టల్‌ కార్యాలయానికి వెళ్లి రూ.3,500  చెల్లించి పార్సిల్‌ తీసుకున్నాడు. బాక్స్‌ విప్పి చూడగా అందులో కూరగాయలు తరిగే సెట్‌ ఉంది. దీంతో తాను మోసపోయానని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు