వైరల్‌ వీడియో ఆధారంగా మహిళపై రౌడీషీట్

26 Jan, 2019 19:50 IST|Sakshi

సాక్షి, చిత్తూరు : జిల్లాలోని ముట్టూరుకి చెందిన గీతాంజలి అనే మహిళపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్‌ చేశారు. సాదిక్‌ అనే మైనర్‌ బాలుడిని గీతాంజలి, ఆమె కొడుకు కలిసి దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. వీడియో ఆధారంగా పోలీసులు గీతాంజలిపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేశారు. 

అయితే సాదిక్‌ అనే మైనర్‌ బాలుడు ఓ అమ్మాయికి సంబంధించిన ఫోటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడని, దీంతో ఆ అమ్మాయికి వరుసకు చిన్నమ్మ అయిన గీతాంజలి  సాదిక్‌పై దాడి చేసినట్టు సమాచారం. గీతాంజలితో పాటు ఆమె కుమారుడు కూడా సాదిక్‌ను చితకబాదాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో గీతాంజలిపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్‌ చేశారు.

మరిన్ని వార్తలు