డబ్బులు అడిగారని వలస కూలీలపై కంపెనీ సూపర్ వైజర్ ఘాతుకం
సాక్షి, వికారాబాద్ : తమకు రావాల్సిన కూలీ డబ్బులు అడిగినందుకు వలస కూలీలపై దారుణానికి ఒడిగట్టాడో కంపెనీ సూపర్ వైజర్. ఈ సంఘటన బుధవారం పరిగి మండలంలో చోటుచేసుకుంది. వివరాల మేరకు.. పరిగి మండలం రంగాపూర్లోని ప్లైవుడ్ కంపెనీలో పనిచేస్తున్న వలస కూలీలు లాక్డౌన్ కారణంగా పనులు లేకపోవటంతో తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లడానికి నిశ్చయించుకున్నారు. న్యాయంగా తమకు రావలసిన కూలీ డబ్బులు ఇస్తే స్వస్థలాలకు వెళ్తామని కంపెనీ సూపర్ వైజర్ను అడిగారు. దీంతో ఆగ్రహించిన సూపర్ వైజర్ వారిపై విరుచుకుపడ్డాడు. ఇష్టం వచ్చినట్లు వారిని చితకబాదాడు. కొందరి తలలు పగలకొట్టి, కాళ్లు విరగొట్టి దారుణంగా ప్రవర్తించాడు.
చదవండి : పెళ్లి సాకుతో రెండేళ్లుగా యువతిపై..