పంది విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ

31 Jan, 2018 15:11 IST|Sakshi
బేతంపూడిలో పోలీసులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పంది విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సంఘటన టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామంలో బుధవారం జరిగింది. పంచాయతీలో మాట్లాడుదామని చెప్పి ఓ వర్గానికి చెందిన వారిని మరో వర్గానికి చెందిన వారు చితకబాదారు. గ్రామానికి చెందిన సింగబోయిన నాగరాజు మిర్చి తోటలో మేడ కృష్ణకు చెందిన పంది వెళ్లి నాశనం చేసిందని పందిని చంపారు.

ఈ విషయమే ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలోఇద్దరు దంపతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు