కుక్క మూత్రం పోసిందని.. మహిళలపై దాడి

22 Apr, 2019 16:06 IST|Sakshi

సాక్షి, పెద్దపల్లి: జిల్లాలో ఓ కాంగ్రెస్‌ కార్యకర్త రెచ్చిపోయాడు. మహిళలపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లిలో లక్ష్మీ అనే మహిళకు చెందిన కుక్క కాంగ్రెస్‌ కార్యకర్త సందీప్‌ ఇంటిముందు మూత్ర విసర్జన చేసింది. దీంతో ఆగ్రహానికి లోనైనా సందీప్‌ లక్ష్మీతోపాటు ఆమె కూతురు కల్పనతో గొడవకు దిగాడు. ఆ తర్వాత దుర్భాషలాడుతూ వారిపై దాడికి పాల్పడ్డాడు. అడ్డుకోవడానికి వచ్చిన వారిపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనతో బిత్తరపోయిన మహిళలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు సందీప్‌ను అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు