ప్రియురాలిని తుపాకీతో కాల్చి..ఆపై ఆత్మహత్య

10 Oct, 2018 09:07 IST|Sakshi

చెన్నై: నగరంలోని విలుపురం జిల్లా అన్నియూరులో దారుణం చోటు చేసుకుంది.  ప్రియురాలిని తుపాకీతో కాల్చి చంపిన ప్రియుడు కార్తివేలు.. ఆపై తను కూడా అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నైలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కార్తివేలు-మెడిసన్‌ చదువుతున్న సరస్వతిలు గత కొంతకాలంగా ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌.  ఈ క‍్రమంలోనే వారి మధ్య స్నేహం పెరిగి ప్రేమకు దారి తీసింది.

అయితే సరస్వతిపై అనుమానం పెంచుకున్న కార్తివేలు. . ఆమెను హత్య  చేసినట్లు తెలుస్తోంది. ఈ క‍్రమంలోనే సరస్వతి పుట్టినరోజుకు వచ్చి ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం కార్తివేలు కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

మరిన్ని వార్తలు