చెన్నై: నగరంలోని విలుపురం జిల్లా అన్నియూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిని తుపాకీతో కాల్చి చంపిన ప్రియుడు కార్తివేలు.. ఆపై తను కూడా అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నైలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కార్తివేలు-మెడిసన్ చదువుతున్న సరస్వతిలు గత కొంతకాలంగా ఫేస్బుక్ ఫ్రెండ్స్. ఈ క్రమంలోనే వారి మధ్య స్నేహం పెరిగి ప్రేమకు దారి తీసింది.
అయితే సరస్వతిపై అనుమానం పెంచుకున్న కార్తివేలు. . ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సరస్వతి పుట్టినరోజుకు వచ్చి ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం కార్తివేలు కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.