కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

29 Apr, 2019 14:37 IST|Sakshi

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పోలీస్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు యత్నించాడు. జీలుగుమిల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవి.. కూల్‌ డ్రింక్‌లో పురుగు మందు కలుపుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో రవిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య వివాదాల నేపథ్యంలో ఆత్మహత్యకు యత్నించాడని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు