థానే : మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసే తన కర్తవ్యాన్ని మరిచి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తనపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడంటూ..బివాండి తాలుకాలోని కొంగావ్ ప్రాంతానికి చెందిన ఓ 23 ఏళ్ల యువతి రెండు నెలల క్రితం స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..విచారణ కోసమై ఆ కేసును శాంతినగర్ పోలీసు స్టేషన్కు బదిలి చేశారు. అయితే కొద్ది రోజుల తర్వాత అత్యాచారానికి పాల్పడిన యువకుడికి, యువతికి మధ్య ఒప్పందం కుదిరింది.
నిందితుడు తాను మంచి స్నేహితులమని.. ఈ నేపథ్యంలో ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని యువతి నిర్ణయించుకున్నారు. దీంతో కేసు దర్యాప్తులో ఉన్న శాంతి నగర్ పోలీస్ స్టేషన్కు సదరు యువతి వెళ్లింది. అక్కడ ఎస్సైగా పనిచేస్తున్న రోహన్ను ఆమె సంప్రదించించారు. ఆమెపై కన్నేసిన సదరు కీచక ఎస్సై.. ఆ యువకుడిని విడుదల చెయ్యాలంటే రాజ్నోలీ బైపాస్ రోడ్డులో తనని కలవాలని చెప్పారు.
ఎస్సై చెప్పిన చోటుకి వెళ్లిన యువతిని రోహన్ తన గెస్ట్హౌజ్కి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడారు. తనపై ఎస్సై అత్యాచారానికి పాల్పడంటూ..ఆ యువతి కొంగావ్ పోలీసులను ఆశ్రయించారు. ఎస్పై రోహన్పై కేసు నమోదు చేశామని.. అరెస్ట్ చేసి విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.