ఉరి వేసుకుని దంపతులు ఆత్మహత్య

15 Oct, 2019 08:10 IST|Sakshi
ఆత్మహత్యకు పాల్పడిన దంపతులు సంతోష్, పార్వతి (ఫైల్‌)

కర్ణాటక ,బొమ్మనహళ్లి: మానసిక వేదనతో దంపతులు ఇంటిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన శివమొగ్గ జిల్లాలోని భద్రావతి తాలుకాలోని అరగదహళ్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. సంతోష్‌ (32), పార్వతి (27) ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు... సంతోష్‌కు వ్యవసాయం ఉంది. ఆదివారం పౌర్ణమి కావడంతో కుటుంబ సభ్యులు భూముల్లో పూజలు చేయడానికి వెళ్లారు. అయితే సంతోష్, పార్వతిలు తరువాత వస్తామని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు. ఈ క్రమంలో సంతోష్, పార్వతిలో గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సాయంత్రం కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా విషయం వెలుగుచూసింది. ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులు తీవ్రంగా విలపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు