వివాహమైన ఏడాదికే దంపతుల ఆత్మహత్య

1 Nov, 2019 08:02 IST|Sakshi
కేశవరాజ్, కీర్తిక (ఫైల్‌)

తమిళనాడు, అన్నానగర్‌: వివాహమైన ఏడాదికే దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కరుమత్తమ్‌పట్టి సమీపంలో మంగళవారం ఈ ఘటన విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం మేరకు.. కోవై కరుమత్తమ్‌పట్టి సమీపం కనియూర్‌ పొణ్ణాన్‌డామ్‌ పాలైయమ్‌ ప్రాంతానికి చెందిన జయశంఖర్, రంజని దంపతులు. వీరి కుమారుడు కేశవరాజ్‌ (22) అదే ప్రాంతంలో ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతని భార్య కీర్తికా (20). వీరికి ఏడాది ముందే వివాహమైంది. బుధవారం మధ్యాహ్నం వరకు ఇంట్లో కేశవరాజ్, కీర్తికా ఉన్న గది తలుపులు తెరవలేదు. అనుమానం చెందిన కేశవరాజ్‌ తల్లిదండ్రులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూశారు. కేశవరాజ్, కీర్తికా ఇద్దరూ ఒకే తాడుతో ఉరికి వేలాడుతూ కనిపించారు.  దిగ్భ్రాంతి చెందిన తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ ఘటనపై కరుమత్తమ్‌పట్టి పోలీసులు విచారణ చేస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు