క్రేన్‌ను ఢీకొన్న డీసీఎం: డ్రైవర్‌ మృతి

27 Jan, 2018 09:03 IST|Sakshi
క్రేన్‌ను ఢీకొన్న డీసీఎం వాహనం

సాక్షి, పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పటాన్‌చెరు ఎంవీఐ కార్యాలయం సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. ఆగి ఉన్న క్రేన్‌ను డీసీఎం ఢీకొంది. ఈ సంఘటనలో డీసీఎం డ్రైవర్‌ క్యాబిన్‌లోనే మృతిచెందాడు. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ డీసీఎం అనంతపురం నుంచి కాన్పూర్‌కు టమాటా లోడు తీసుకెళ్తున్నది. కాగా, క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ మృతదేహాన్ని వెలికి తీసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. 

మరిన్ని వార్తలు