క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో నిందితుడి అరెస్ట్‌

31 Jan, 2019 09:44 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో:సెల్‌ఫోన్‌ల ద్వారా ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న వ్యక్తిని సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఆస్ట్రేలియాలోని మార్వెల్‌ స్టేడియంలో జరుగుతున్న రెనీగ్రేడ్స్, సిడ్నీ థండర్‌ టీ–20 మ్యాచ్‌పై, కేఎఫ్‌సీ బిగ్‌బాష్‌ లీగ్‌ 2018–19పై బెట్టింగ్‌ నిర్వహిస్తున్న  ఫీల్‌ఖానా వాసి సూరజ్‌ వ్యాస్‌ను షాహినాయత్‌గంజ్‌ ఠాణా పరిధిలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.5,38,000 నగదు, రెండు సెల్‌ఫోన్లు, ఒక ఎల్‌ఈడీ టీవీ, ఒక ల్యాప్‌టాప్, రెండు ప్యాకెట్‌ డైరీలను స్వాధీనం చేసుకున్నారు.డిగ్రీ పూర్తి చేసి మూడు కంపెనీల్లో అకౌంటెంట్‌గా పనిచేసిన సూరజ్‌ వ్యాస్‌ జల్సాలకు అలవాటుపడి ఈజీమనీ కోసం 2017 నుంచి క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. తదుపరి విచారణ కోసం షాహినాయత్‌గంజ్‌ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ పి.రాధాకిషన్‌ రావు తెలిపారు. పరారీలో ఉన్న విశాల్‌ కోసం గాలిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు