భవనంపై నుంచి దూకిన కానిస్టేబుల్‌.. విషాదం

30 Jul, 2019 10:07 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఐదు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఓ సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణాజిల్లా చిన్న ఆవుటపల్లి సమీపంలో ఉన్న సీఆర్పీఎఫ్ క్యాంప్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మరియా విన్నర్ అనే కానిస్టేబుల్‌ భవనంపై నుంచి దూకారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను సమీపంలోని పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే చనిపోయారు. కానిస్టేబుల్ మరియా విన్నర్ తమిళనాడులోని నాగాపట్నంవాసి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని ఆత్కూరు పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు. మరియా విన్నర్‌ ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు.

మరిన్ని వార్తలు