ఏటీఎం కార్డుల క్లోనింగ్‌ ముఠా అరెస్టు

17 Mar, 2020 18:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఏటీఎం కార్డులను క్లోనింగ్‌ చేస్తున్న ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. కాగా వీరు ఒడిశాకు చెందిన ముఠాగా గుర్తించినట్లు తెలిపారు. గచ్చిబౌలి హెడీఎఫ్‌సీ మేనేజర్‌ ఫిర్యదుతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కాగా నిందితులు 140 క్లోనింగ్‌ ఏటీఎం కార్డుల సాయంతో రూ. 13 లక్షలు విత్‌ డ్రా చేసినట్లు తేలింది. నిందితుల నుంచి రూ. 10 లక్షలతో పాటు స్కిమర్‌, క్లోనింగ్‌ మిషన్‌, 44 క్లోన్డ్‌ ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. 


 

మరిన్ని వార్తలు