హైకోర్టులో డీఎస్‌ పిటిషన్‌

16 Aug, 2018 17:36 IST|Sakshi

హైదరాబాద్‌: నర్సింగ్‌ విద్యార్థినిలపై లైంగిక వేధింపుల కేసులో తన కుమారుడు సంజయ్‌ని అరెస్ట్‌ చేసి పోలీసు రిమాండ్‌ విధించడాన్ని సవాల్‌ చేస్తూ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్‌ గురువారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తన కుమారుడిని ఏపీ పోలీస్‌ మాన్యువల్‌ ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌ చేశారు..తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు పోలీసు మాన్యువల్‌ తయారు చేయలేదని పేర్కొన్నారు.

నిజామాబాద్‌ మాజీ మేయర్‌ సంజయ్‌పై పెట్టిన కేసులు చెల్లవని హైకోర్టులో డీఎస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు