మహిళ మృతి, యువకుడి పరిస్థితి విషమం
సనత్నగర్: సహజీవనం చేస్తున్న జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా, యువకుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. లాల్బహుదూర్ శాస్త్రీనగర్కు చెందిన చైతన్య (35), భూపాల్ (32)గత పదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. బుధవారం రాత్రి వారిద్దరూ ఇంట్లో యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న వీరిని గుర్తించిన స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చైతన్య గురువారం మృతి చెందగా, భూపాల్ పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మహత్యాయత్నారనికి కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.