బొల్లారం: తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటం చూడలేక మనస్తాపానికిలోనైన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బోయిన్పల్లిలోని నందమూరి నగర్లో ఉంటున్న యాదగిరి, సునీత దంపతుల కుమార్తె నిరోష తొమ్మిదో తరగతి చదువుతోంది. గత కొద్ది రోజులుగా సునీత అనారోగ్యంతో బాధపడుతుండటంతో రెండు రోజులుగా నిరోష అమెను ఆసుపత్రికి తీసుకెళ్లి వస్తోంది. అయితే తల్లి ఆరోగ్యం కుదుట పడకపోవడంతో మనస్తాపానికి లోనైన నిరోష ఆదివారం మధ్యాహ్నంఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.