గ్యాస్ సిలిండర్ పేలి 10 మంది మృతి

14 Oct, 2019 10:17 IST|Sakshi

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మవు జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 10 దుర్మరణం పాలయ్యారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు తగిన వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు