అమానుషం: చెత్త రిక్షాలో శవం తరలింపు

5 Jun, 2018 10:53 IST|Sakshi

బాలాసోర్‌ : ఒడిశాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అంతిమ యాత్రకు నోచుకోలేని ఓ శవాన్ని చెత్త రిక్షాలో ఈడ్చుకెళ్లారు. దీన్ని ఓ ఫోటోగ్రాఫర్‌ ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాసోర్‌లోని ఓ రోడ్డుపై అపస్మారక స్థితిలో ఉన్న గుర్తుతెలియని వ్యక్తిని గమనించిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోనే ప్రాణాలు వదిలారు. మరణించి 72 గంటలైనా మృతదేహన్ని తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోవడంతో పోలీసులు శవాన్ని మున్సిపాలిటీ సిబ్బందికి అప్పగించారు.

మున్సిపాలిటీకి చెందిన ఓ శాఖకు శవాన్ని దహనం చేసే పనిని అప్పగించారు. వారు చెత్తను తరలించే ట్రాలీలో శవాన్ని తీసుకెళ్లారు. కాగా ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సోరో మున్సిపాలిటీ ఎగ్జిక్యూటివ్‌ అధికారి తెలిపారు.

మరిన్ని వార్తలు