వీఆర్‌ఎస్‌ కాలువలోమృతదేహం

10 Apr, 2018 08:32 IST|Sakshi
కాలువలో సన్యాసినాయుడు మృతదేహం 

మృతిపై అనుమానాలు   

మక్కువ: మండలంలోని సరాయివలస గ్రామానికి చెందిన గులిపల్లి సన్యాసినాయుడు (45) అనుమానస్పదంగా మృతి చెందాడు. గ్రామస్తులు, కుటంభసభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం... సన్యాసినాయుడు ఈ నెల 5వ తేదీ రాత్రి 9గంటల సమయంలో పొలానికి నీరు కట్టేందుకు వెళ్లాడు.

మరుచటి రోజు కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు.ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు వీఆర్‌ఎస్‌ కాలువలో మృతదేహం తేలాడాన్ని గుర్తించి కుటంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్సై వెలమల ప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.  

అనుమానాలు..

నాలుగు రోజులుగా సన్యాసినాయుడు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గరయ్యారు. ఇంటి వద్ద ఎటువంటి గొడవలు లేకపోవడంతో ఆత్మహత్య చేసుకునే అఘాయిత్యం లేదనిపిస్తోంది.

నీరు పెట్టే సమయంలో ఎవరితోనైనా గొడవలు జరిగాయా..? వారే హత్య చేసి కాలువలో పడేశారా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల విచారణలో ఏమి తేలుతుందోనని గ్రామస్తులు వేచి చూస్తున్నారు. 

మరిన్ని వార్తలు