మనస్తాపంతో యువతి అదృశ్యం

23 Oct, 2019 12:07 IST|Sakshi
చాందిని

విశాఖ,గాజువాక : డిగ్రీలో పాసవలేదన్న మనస్తాపంతో ఒక యువతి ఇంటి నుంచి అదృశ్యమైట్టు గాజువాక పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖ జిల్లా మాకవరపాలెం మండలానికి చెందిన చాందిని (20) డిగ్రీ వరకు చదువుకుంది. డిగ్రీలోని చివరి సెమిస్టర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదు. దీంతో గాజువాక హైస్కూల్‌ రోడ్‌లో నివాసముంటున్న తన అక్క ఇంటికి ఇటీవల వచ్చింది. సప్లిమెంటరీలో పాస్‌ కావచ్చని భావించిన ఆమె సమయం వృథా కాకుండా కాంపిటేటివ్‌ పరీక్షలకు కూడా సిద్ధమవుతోంది. అయితే మంగళవారం ఉదయం నుంచి ఆమె ఇంట్లో కనిపించలేదు. డిగ్రీ పాస్‌ కాకపోవడం వల్ల తనకు ఉద్యోగం రాదనే విషయం ఆందోళన కలిగిస్తోందని, అందుకే ఇల్లు వదిలి వెళ్లిపోతున్నానని, తనకోసం వెతకవద్దని ఒక పేపర్‌పై రాసి వెళ్లిపోయినట్టు చాందిని బావ మోహనరావు గాజువాక పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితురాలి బావ ఫిర్యాదు మేరకు గాజువాక ఎస్‌ఐ రామారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు