గన్‌ చూయించి రూ.70 లక్షలు దోచుకెళ్లారు

4 Aug, 2018 09:03 IST|Sakshi
వ్యాపారిని గన్‌తో బెదిరిస్తోన్న దుండగుడు

న్యూఢిల్లీ: ఢిల్లీ నగరంలో రద్దీగా ఉండే ఓ ప్లైఓవర్‌పై గురువారం దోపిడీ జరిగింది. ఈ దోపిడీకి సంబంధించి ఓ వీడియో శనివారం వెలుగులోకి వచ్చింది. కాశీష్‌ బన్సాల్‌ అనే వ్యక్తి తన ఇంటి నుంచి గుర్‌గావ్‌కు కారులో వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు ఢిల్లీ నరైనా ప్రాంతంలోని ఓ ప్లైఓవర్‌పై అడ్డగించారు. తుపాకీ చూయించి కారు డిక్కీలో ఉన్న రూ.70 లక్షలు ఎత్తుకెళ్లారు.

అయితే ఈ తతంగాన్ని అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి తన మొబైల్‌లో రికార్డు చేశాడు. అనంతరం పోలీసులకు వీడియోను చూయించాడు. విచారణ ప్రారంభించిన పోలీసులు, వ్యాపారికి బాగా తెలిసిన వాళ్లే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు