న్యూఢిల్లీ: ఢిల్లీలో దొంగలు భారీ చోరీకి తెగబడ్డారు. నగరమంతా దీపావళి సంబరాల్లో ఉండగా దుండగులు నగల తయారీ యూనిట్లలో చొరబడి చేతివాటం ప్రదర్శించారు. రూ.12 కోట్ల విలువైన నగలను ఎత్తుకెళ్లారు. సెంట్రల్ ఢిల్లీలోని కరోల్బాగ్లో ఈ చోరీ జరిగింది. కరోల్బాగ్లోని ఓ భవనంలో రెండు నగల తయారీ యూనిట్లు ఉన్నాయి.
వీటిపై కన్నేసిన దొంగలు ఈ నెల 19వ తేదీ రాత్రి వచ్చి గ్యాస్ కట్టర్తో తాళాలను తెరిచారు. ఒక యూనిట్లో రూ.6.80 కోట్ల విలువైన నగలు, మరోదానిలో రూ.5.20 కోట్ల విలువైన నగలను చోరీ చేశారు. ఈ తతంగమంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. మరునాడు యజమానులు వచ్చి చూసేసరికి దొంగతనం విషయం బయట పడిం