ఢిల్లీలో భారీగా పట్టుబడ్డ బంగారం, నగదు

11 Jan, 2018 12:17 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో బంగారం, నగదు భారీగా పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది. యు అండ్‌ ఐ వాల్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థలో నిర్వహించిన సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. భారీ మొత్తంలో నగదు, బంగారాన్ని ఢిల్లీ డైరెక్టరేట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు, బంగారం.. గుట్కా తయారీదారునివిగా గుర్తించారు. గుట్కా తయారీతో పాటు బిల్డర్‌గా పని చేస్తున్న ఆ వ్యక్తి నుంచి ఇప్పటి వరకు  రూ.61కోట్ల నగదు, బంగారం సీజ్ చేశారు. 

మరిన్ని వార్తలు