హైదరాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

23 Nov, 2019 18:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌లో భారీగా బంగారం పట్టుబడింది. ఈస్ట్‌మారేడుపల్లిలోని షైన్‌ హాస్పిటల్‌పై దాడులు చేసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ అధికారులు.. నలభై బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ. రెండు కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బంగారాన్ని ఇద్దరు వ్యక్తులు కారులో క్యాలికట్‌ నుంచి మైసూర్‌ మీదుగా హైదరాబాద్‌కు తరలించినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం ముగ్గురు వ్యక్తులను అదుపులోకి విచారిస్తున్నారు. నిందితుల నుంచి రూ.2కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు