హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలం

1 Sep, 2018 16:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజధానిలో డ్రగ్స్ మాఫియా తోక ముడిచిందని అంతా భావించారు. కానీ అది ఇంకా విస్తరిస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో నల్లజాతీయుని వద్ద ఎక్సైజ్ శాఖ (ఎస్‌టీఎఫ్‌) అధికారులు 100 గ్రాముల కొకైన్‌ను సాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల... ప్రకారం రిపబ్లిక్‌ (ఆఫ్రికా)కు చెందిన పీటర్‌ అనే వ్యక్తి మెహిదీపట్నంలోని మక్తాలో డ్రగ్స్‌ అమ్ముతుండగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గర నుంచి 100 గ్రాముల కొకైన్ తో పాటు లక్ష రూపాయల నగదును స్వాధీనం చెసుకున్నారు.

మరిన్ని వార్తలు