తాగిన మత్తులో పోలీసులను చెడుగుడు ఆడేశాడు!

13 Oct, 2019 11:40 IST|Sakshi

సాక్షి, సిరిసిల్లా: తాగిన మందు తలకెక్కింది. ఇంకేముంది మత్తులో ఉన్న మందుబాబు డ్యూటీలో ఉన్న పోలీసులనే చెడుగుడు ఆడేశాడు. మందుబాబు దాడి చేస్తుంటే..రక్షకభటులను స్థానికులు రక్షించిన ఘటన సిరిసిల్లలో జరిగింది. సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద నామాపూర్‌కు చెందిన శివకుమార్‌ అనే వ్యక్తి మద్యం మత్తులో పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. తన ఊరికి బస్సు ఎందుకు లేదని హల్‌ చల్‌ చేస్తూ దాడికి దిగాడు. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు అతడిని పట్టుకుని పీఎస్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు