ప్రాణం తీసిన మద్యం మత్తు

4 Apr, 2020 12:04 IST|Sakshi

కర్నూలు రూరల్‌: మద్యం మత్తు ఓ యువకుడి ప్రాణాలు తీసింది.  కర్నూలు మండలం రేమట గ్రామానికి చెందిన బోయ శివ(24) కొట్టాల గ్రామంలో వివాహం చేసుకున్నాడు. భార్య ఏడు నెలల గర్భిణి కావడంతో పుట్టింటికి వెళ్లింది. భార్యను చూసేందుకని శివ కొట్టాలకు వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన ఇద్దరు స్నేహితులతో కలిసి శుక్రవారం సమీపంలోని పొలాల్లోకి విందు చేసుకునేందుకు వెళ్లారు. అక్కడ పూటుగా మద్యం తాగారు. విశ్రాంతి తీసుకుందామని నిద్రకు ఉపక్రమించారు. మద్యంమత్తులో ఉన్న శివ కాసేపటికే సమీపంలో ఉన్న బావిలో పడిపోయాడు. స్నేహితులు సాయంత్రం నిద్రలేచేసరికి శివ కనిపించకపోవడంతో బావిలో చూడగా మృతదేహం తేలియాడుతుండటం చూసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. 

ఎమ్మెల్యే పరామర్శ: శివ మృతదేహాన్ని రేమటకు తీసుకురావడం తెలుసుకున్న కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌ గ్రామానికి చేరుకున్నారు. మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఎమ్మెల్యే వెంట రేమట సుదర్శన్‌రెడ్డి, ఉల్చాల వాసు, రేమట ఎంపీటీసీ అభ్యర్థి కాల్వమునిస్వామి, సంపత్, తిరుమల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు