డ్రంకెన్‌ డ్రైవర్‌కు ట్రాఫిక్‌ విధులు

1 Nov, 2019 04:31 IST|Sakshi

షాద్‌నగర్‌ టౌన్‌: మద్యం తాగి కారు నడుపుతూ పట్టుబడిన ఓ డ్రైవర్‌కు షాద్‌నగర్‌ కోర్టు 2 గంటలు ట్రాఫిక్‌ విధులు నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పరిధిలోని రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద కడ్తాల్‌కు చెందిన నర్సింలు మద్యం తాగి డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడ్డాడు. గురువారం షాద్‌నగర్‌ కోర్టులో హాజరుపరచగా.. జడ్జి అతడికి 2 గంటలు ట్రాఫిక్‌ విధులు నిర్వహించాలని శిక్ష విధించారు.

మరిన్ని వార్తలు