భార్యను హత్య చేసిన భర్త

15 May, 2020 14:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో : మద్యం మత్తు పైగా క్షణికావేశం.. భార్యను హత్య చేశాడో భర్త. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బరేలీకి చెందిన అజయ్‌కి పింకీ అనే మహిళతో ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే గతకొద్ది సంవత్సరాలుగా వీరు పింకీ పుట్టింటి వద్ద ఉంటున్నారు. గురువారం ఫుల్లుగా మద్యం సేవించిన అజయ్‌ భార్యతో గొడవపడ్డాడు. గొడవ పెద్దదవటంతో ఆమెను గదిలోకి లాక్కెళ్లి తలుపు గడియ బిగించేశాడు. ఆమె నోటిలో గుడ్డకుక్కి దాడికి దిగాడు. కత్తితో ఆమె గుండెల్లో పొడిచి, ఇటుకతో తలపై కొట్టాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. ( అవమానాన్ని తట్టుకోలేక బలవన్మరణం )

ఆ సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న వారి ఇద్దరి పిల్లలు తండ్రి ఆవేశంగా వెళ్లిపోవటం, అతడి బట్టలకు రక్తపు మరకలు ఉండటం గమనించారు. అనుమానంతో ఇంటి లోపలికి వెళ్లి చూడగా తల్లి మరణించి ఉంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న అజయ్‌ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే పింకీ, అజయ్‌ల మధ్య ప్రాణాలు తీసుకునేంత గొడవలేమీ లేవని మృతురాలి తండ్రి ద్రిగ్‌పాల్‌ చెబుతుండటం గమనార్హం.

మరిన్ని వార్తలు