మద్యం మత్తులో యువకుడి హల్‌చల్‌

12 Jun, 2019 08:07 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : మద్యం మత్తులో ఓ యువకుడు హల్‌చల్‌ చేశాడు. పిచ్చిపట్టిన వాడిలా ప్రవర్తిస్తూ సామాన్య ప్రజలపైనే కాకుండా పోలీసులపై సైతం దాడికి దిగాడు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఏలూరు 1టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆముదాల అప్పలస్వామికాలనీకి చెందిన సేనాపతి పూటుగా మద్యం సేవించి అక్కడి జనంపై దాడికి పాల్పడ్డాడు. దీంతో అతడిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సేనాపతిని పోలీసు స్టేషన్‌కు తీసుకురాగా పోలీసులపైకే అతడు దాడికి దిగాడు. పిచ్చిపట్టిన వాడిలా స్టేషన్లోని పూల కుండీలను ధ్వంసం చేస్తూ.. వాటిని తలకేసి కొట్టుకుంటూ ‘‘ నేను చచ్చిపోతా.. నన్ను చంపేయండి..’’ అంటూ ఓ శాడిస్టులా వ్యవహరించాడు. డ్రంక్‌ అండ్‌ టెస్ట్‌కు సహకరించకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.

మరిన్ని వార్తలు