దారుణం : 8ఏళ్ల చిన్నారిపై అత్యాచారం జరిపి ఆపై..

9 Jun, 2019 20:46 IST|Sakshi

సాక్షి, భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేసి మురుగు కాలువలో పడేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలోని మురికివాడలో నివాసముంటున్న బాలిక శనివారం సాయంత్రం దుకాణానికని వెళ్లింది. ఎంతకీ తిరిగి రాకపోవడంతో పోలీసులకు చిన్నారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆదివారం ఉదయం స్థానికంగా ఉన్న మురికి కాల్వలో బాలిక మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నివేదికలో అత్యాచారం అనంతరం బాలికను గొంతు నులిమి హత్య చేసినట్టు తేలింది. 

అయితే ఫిర్యాదు అనంతరం బాలిక ఇంటికి వచ్చిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో ఆరుగురు పోలీసులపై సస్సెండ్‌ వేటు పడింది. ఈ ఘటనపై స్పందించిన మధ్యప్రదేశ్ హోంమంత్రి బాల బచ్చన్, ఈ ఘటనకు సంబంధించి బాలిక ఇంటి సమీపంలో నివాసముండే విష్ణు అనే కూలిని అనుమానిస్తున్నామని, అతడు పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామన్నారు. పలువురు స్థానికులను కూడా అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భోపాల్ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ పాప కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాలిక మృతి మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ‘ మానవత్వం చచ్చిపోతుంది. నీ చిరునవ్వులను చిదిమేసిన దుండగులను వదిలిపెట్టం. చట్టం వారిని వదిలి పెట్టది’  అని ట్విట్‌ చేశారు.

మరిన్ని వార్తలు