మొబైల్‌ చోరీ చేశాడంటూ చావబాదారు..

17 Mar, 2020 12:10 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

జైపూర్‌ : మొబైల్‌ ఫోన్‌ చోరీ చేశాడనే అనుమానంతో దళిత వ్యక్తిని దారుణంగా కొట్టడంతో బాధితుడు మరణించిన ఘటన రాజస్ధాన్‌లోని సికార్‌ జిల్లాలో వెలుగుచూసింది. 12 రోజుల కిందట జరిగిన ఈ ఘటనలో మదన్‌ లాల్‌ మీనా (75) సవాయ్‌ మాన్‌ సింగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకూ ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. వృద్ధుడిపై దాడి కేసులో నిందితులు జితేంద్ర యాదవ్‌, భరత్‌భూషణ్‌, దిలీప్‌ సింగ్‌, సందీప్‌ మీనా, సందీప్‌ యాదవ్‌లను అరెస్ట్‌ చేశామని అదనపు ఎస్పీ దినేష్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ఓ హోటల్‌ వద్ద తమ మొబైల్‌ ఫోన్‌ను మదన్‌ లాల్‌ మీనా దొంగిలించాడనే అనుమానంతో ఐదుగురు నిందితులు అతడిని తీవ్రంగా కొట్టారు. మార్చి 4న ఈ ఘటన జరగ్గా, వృద్ధుడిని నిందితులు కొడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుడి కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి : మహిళా కండక్టర్‌పై దాడి.. కానిస్టేబుళ్లపై వేటు!

మరిన్ని వార్తలు