ఉప్పల్: కెనడా వెళ్లడానికి వీసా కోసం తనతో నిశ్చితార్థం అయిన యువతితో కలిసి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వీసా చేతికి వచ్చిన తర్వాత ఓ యువకుడు ముఖం చాటేశాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.ఉప్పల్ కళ్యాణపురి ప్రాంతానికి చెందిన యువతితో నగరానికి చెందిన అరవింద్ కుమార్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ నిశ్చితార్థం జరిగింది. కెనడా వెళ్లేందుకు గాను త్వరగా వీసా తీసుకునేందుకు ఇద్దరు కలిసి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వీసా వచ్చిన తరువాత అతను ముఖం చాటేయడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు తనకు న్యాయం చేయాలని కోరుతూ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.