నాలుగేళ్ల చిన్నారిపై దారుణం

28 Jun, 2019 14:35 IST|Sakshi

చెన్నై : తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. బాధ్యతాయుతమైన సైనిక విధులు నిర్వహించిన వ్యక్తి వృత్తికే కళంకం తెచ్చాడు. వావివరసలు మరిచి పసికందును చిదిమేశాడు. వివరాలు.. తిరుముల్లెవాయిల్‌కు చెందిన మీనాక్షి సుందరం అనే వ్యక్తి సైనికుడిగా విధులు నిర్వహించి రిటైర్‌ అయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సుందరం తనకు కూతురు వరసయ్యే నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి.. హత్య చేశాడు. చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సుందరాన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు

మరిన్ని వార్తలు