గుప్త నిధుల కోసం తవ్వకాలు

9 May, 2019 13:14 IST|Sakshi
గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన బావి ఇదే

వైఎస్‌ఆర్‌ జిల్లా, అట్లూరు : అట్లూరు మండలం కమలకూరు పంచాయతీ నల్లాయపల్లి రెవెన్యూ పొలంలోని పాపాయకుంట దగ్గర ఉన్న పురాతనమైన బావిలో గత వారం రోజు లుగా  కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరుపుతున్నారు. పూర్వ కా లంలో రాజులు ఇక్కడికి వేటమార్గంలో వచ్చినప్పుడు వారాల తరబడి ఈ బావి సమీపంలో సేద తీర్చు కోవడంతో పాటు కొంతమేర గుప్తనిధులు ఈ బావిలో భద్రపరిచేవారని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో బావిలో తవ్వకాలు జరపగా సు మారు పది అడుగుల లోతులో రెండు నీటి తొట్లు బయటపడ్డాయి. పోలీసులు వి చారణ జరిపితే తవ్వకాలు జరిపిన వ్యక్తులు ఎవరనేది తెలిసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు