ఖమ్మం వైరా : కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్సై తాండ్ర నరేష్ తెలిపిన వివరాలు... స్థానిక బీసీ కాలనీకి చెందిన చందా సైదారావు(36), ఆయన భార్య వరలక్ష్మి మధ్య కొన్నాళ్లుగా ఘర్షణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఆమె సోదరుడైన రామారావు, శుక్రవారం సైదారావు ఇంటికి వచ్చి బెదిరించాడు, దాడి చేశాడు. అదే రోజు రాత్రి, ఎస్బీఐ సమీపంలో తనకు చెందిన టీ స్టాల్ వద్ద సైదారావు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మధిర ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. వరలక్ష్మి ఫిర్యాదుతో రామారావుపై కేసు నమోదు చేశారు దర్యాప్తు జరుపుతున్నారు.