విద్యుత్‌ వైర్లు తగిలి.. ముగ్గురి రైతుల దుర్మరణం!

6 Jan, 2019 18:27 IST|Sakshi

మంచిర్యాల : వేమనపల్లి మండలం ముల్కల పేటలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ వైర్లు తగిలి రైతులు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. ముగ్గురు రైతులు ఆదివారం పొలం పనులకు వెళ్లగా..విద్యుత్‌వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు.

వారి పంటపొలాల్లో విద్యుత్‌ లైన్లు వేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో భీమ్‌రామ్‌, రామయ్య, సురేందర్‌ ఉన్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. 

మరిన్ని వార్తలు