కామస్వామికి కటకటాలు

13 Sep, 2019 06:06 IST|Sakshi
అరెస్ట్‌యిన నిందితులు

మహిళను వేధించిన కేసులో తండ్రి, కుమారుడు అరెస్ట్‌

కర్ణాటక,బనశంకరి: సర్పదోషం ఉందని నివారణకు  ఐదుసార్లు తాళికట్టించుకుని ఐదుసార్లు లైంగిక ప్రక్రియలో పాల్గొనాలని ఓ మహిళను మభ్యపెట్టిన కామాంధుడు కామస్వామి గణేశ్‌తో పాటు అతడి కుమారుడిని గురువారం బాణసవాడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాధిత మహిళకు వివాహం కాగా భర్త నుంచి విడిపోయి వేరుగా నివాసముంటోంది. ఈమె బాణసవాడిలో ప్రైవేటు కంపెనీని ఉద్యోగి. సదరు మహిళకు సర్పదోషం ఉండగా తనకు పరిచయస్తులతో కలిసి కామస్వామి గణేశ్, అతడి కుమారుడు మణికంఠను సంప్రదించింది. ఈ నెల 7న కామస్వామి గణేశ్, మణికంఠ ఇద్దరు సర్పదోష నివారణ చేస్తామని సదరు మహిళతో రాత్రి 10 నుంచి 11 గంటల వరకు మహిళ ఇంట్లో పూజలు నిర్వహించారు. పూజ అనంతరం పూజచేసిన వస్తువులను కుక్కేసుబ్రమణ్యలో వదలాలని ఆమెకు సూచించారు. ఈ సమయంలో తండ్రి, కుమారుడు కుక్కె సుబ్రమణ్యలో రెండు ప్రత్యేక గదులు బుక్‌ చేసుకుని మహిళతో కామవాంఛ తీర్చుకోవడానికి పథకం రూపొందించారు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బాణసవాడి పోలీసులు తీవ్రంగా గాలించి గురువారం కామస్వామి గణేశ్, కుమారుడు మణికంఠను అరెస్ట్‌ చేసి తమదైనశైలిలో విచారణ చేపట్టారు.

ఫిర్యాదు వివరాలు :  తనకు సర్పదోషం ఉందని జగన్నాథ్‌ అనే వ్యక్తి కామస్వామి గణేశ్, అతడి కుమారుడు మణికంఠను పరిచయం చేశారని బాధితురాలు తెలిపింది. సర్పదోష నివారణకు పూజ చేయాలంటే రూ.40 వేలు ఖర్చు అవుతుందని కామస్వామి గణేశ్‌ తెలిపారని, అదే సమయంలో తన కాపురం కూడా నిలబడదని చెప్పారు. దీనికి ప్రత్యేక పూజలు చేయాలని పురమాయించారని బాధితురాలు పేర్కొంది. ఈనెల 7న తన ఇంటిలో సర్పదోష పూజల అనంతరం 8న తనను కుక్కె సుబ్రమణ్యకు తీసుకెళ్లి తనపై అత్యాచారం చేయడానికి యత్నించారని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.    

మరిన్ని వార్తలు