కూతురి పెళ్లిపై బెంగతో..

29 Apr, 2020 13:35 IST|Sakshi

రైలు కిందపడి తండ్రి ఆత్మహత్య

కామారెడ్డి సమీపంలో ఘటన

కామారెడ్డి క్రైం:  ఆర్థిక స్థోమత లేకపోవడం, కూతురి పెళ్లి చేయలేక పోతున్నాననే బెంగతో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఎస్సై తావూనాయక్‌ కథనం ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన తిరునగరి శ్రీనివాస్‌ (47)కు భార్య అరుణ, ఓ కుమార్తె ఉన్నారు. కుమార్తె డిగ్రీ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసింది. ఆర్థిక ఇబ్బందులతో శ్రీనివాస్‌ కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతున్నాడు. అదే సమయంలో తన కూతురికి వివాహం చేయలేక పోతున్నాని బెంగ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం కా మారెడ్డిలోని రైల్వే బ్రిడ్జికి సమీపంలో గూడ్స్‌ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

మరిన్ని వార్తలు